మంచిర్యాల జిల్లా: భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం, బతుకమ్మ వాగు వంతన సైడ్ వాల్ మరమ్మత్తు పనులు, కోటపల్లి మండలం లోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్, అన్నారం సరస్వతి బ్యారేజ్ లను సందర్శించి ప్రాణహీత వరద ఉదృతి ని పరిశీలించారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ముందస్తుగా తరలించాలని అన్నారు. పట్టణంలోని చెరువులు, వివిధ ప్రాజెక్టుల కాల్వలను. ఎప్పటికప్పుడు పరిశీలించి, నిఘా ఉంచాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీపీ రెమా రాజేశ్వరి అధికారులను ఆదేశించారు. మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఐపిఎస్., జైపూర్ ఏసీపీ మోహన్, చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసు దేవా రావు, చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యా సాగర్, కోటపల్లి ఎస్ఐ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
