ఆంధ్రప్రదేశ్: పల్నాడు జిల్లా : బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వెల్లటూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు 11 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని మొక్కజొన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తుండటంతో తల్లి గమనించి విషయం అడగగా జరిగిన సంగతి చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.