contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Tirupathi: ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుపతి జిల్లా సత్యవేడు అటవీ ప్రాంతంలో 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు స్మగ్లర్లు ను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ ఐ చిరంజీవి కి చెందిన ఆర్ ఎస్ ఐ ఎం. మురళీధర్ రెడ్డి టీమ్ మంగళవారం సత్యవేడు సమీపంలో బీరకుప్పం సెక్షన్ ఎస్కె మడుగు వద్ద కూంబింగ్ చేపట్టారు. బుధవారం ఉదయం భూపతేశ్వర కోన వద్ద కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వారిని హెచ్చరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలు పడవేసి పారిపోయారు. అయితే పోలీసులు ఇద్దరిని పట్టుకో గలిగారు. వారిని తిరుపతి జిల్లా నాగలాపురంకు చెందిన వ్యక్తులు గా గుర్తించారు. వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ ఐ సీహెచ్ రఫీ దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :