contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైఎస్ కుటుంబానికి అండగా ఉంటాం .. జగన్ కి న్యాయం చేస్తాం : టిడిపి నేత ఆర్ జే వెంకటేష్

మదనపల్లి : రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం కంపినీలు తేవడం, నిరుద్యోగ సమస్యను తీర్చడమే కాదు, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి పాటుపడటమే ప్రభుత్వ లక్షమని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి ఆర్ జే వెంకటేష్ అన్నారు.ఆ విదంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని ఉమ్మడి ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రత్యేక శ్రద్ద చూపుతోందని,రాష్ట్రంలోని ఏంతో మంది ప్రజలు, తమ సమస్యలను ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే PGRS ద్వారా పరిస్కారం చేస్తోందన్నారు.అదే విదంగా గత కొన్ని సంవత్సరాలనుండి వై ఎస్ కుటుంబంలో ఉన్న సమస్యలను సైతం పరిష్కారం చేయడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని, అందుకు y s షర్మిల కానీ జగన్ కానీ PGRS లో తమ సమస్యలు తెలపాలని కోరారు. YS కుటుంబానికి న్యాయం చేయడానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పులివెందుల MLA గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలనుండి తమ కుటుంబ వ్యవహారాల్లో తీసుకొనే న్యాయభద్ధమైన చర్యల్లో విఫలం అవుతున్నాడని, ప్రభుత్వం చేయగలిగే ఎలాంటి న్యాయం అయ్యినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :