contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రభుత్వ భూమి ఇవ్వాలని కలెక్టర్ కి వినతి

సంగారెడ్డి జిల్లాలో ఉన్న కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలకు ఈత తాటి చెట్ల పెంపకం కోసం జీవో నెంబర్ 560 ప్రకారం ప్రభుత్వ భూమి ఇవ్వాలని కోరుతూ ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ని కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ .. జిల్లాలో అనేక గ్రామాలలో ఈత చెట్లు తో ప్రభుత్వ భూములు.ఉన్న. వాటిని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘాలకుకేటాయించకపోవడంతో వాటిలో ఉన్న ఈత చెట్లు నరికివేతకు గురవుతున్నాయి ఆ యొక్క భూములు అక్రమ కబ్జాలకు గురవుతున్నాయి ,ప్రభుత్వం ఆ యొక్క భూములను కాపాడే విధంగా గీతా కార్మికులకు ఉపాధి కల్పించే కల్పించడం కోసంవెంటనే పరిశీలించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 560 ప్రకారం ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల పైన భూమి ఇవ్వాలని. వనమహోత్సవంలో ఈత తాటి చెట్ల పెంపకాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగింది. కలెక్టర్ వెంటనే స్పందించి. వనమహోత్సవ కార్యక్రమంలో ఈత తాటి చెట్ల నాటాలని జిల్లా అధికారులకు చెప్పడం జరిగింది, అలాగే ప్రభుత్వ భూములు పరిశీలించి ఈత చెట్లు ఉన్న భూములను సొసైటీలకు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు మైపాల్ గౌడ్, రాజా గౌడ్, లింగం గౌడ్, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :