contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాజీవ్ రహదారి పై ఆటో కారు ఢీ కొని మహిళ మృతి

సిద్దిపేట జిల్లా: కోహెడ మండలం శంకర్ నగర్ వద్ద రాజీవ్ రహదారి పై కరీంనగర్ నుండి సిద్దిపేట వైపు వెళ్తున్న పాసెంజర్ ఆటో ను వెనుక నుండి వస్తున్న వైట్ కలర్ వర్ణ కారు ప్యాసింజర్ ఆటో ను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామానికి చెందిన కొమ్మెర లక్ష్మి (40) ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. ఆటో డ్రైవర్ చిగురుమామిడి మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం చిగురుమామిడి మండలం సీతారాంపూర్ లో లక్ష్మీ తల్లిని చూడడానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న కోహెడ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆటో డ్రైవర్ ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారని కోహెడ ఎస్సై తిరుపతి తెలిపారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :