contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మెట్రో రైల్ విస్తరణకు నిధులు కేటాయించడం హర్షనీయం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి, పఠాన్ చేరు :  రాష్ట్ర బడ్జెట్ లో మియాపూర్ నుండి పటాన్చెరు వరకు మెట్రో రైలు విస్తరణకు నిధులు కేటాయించడం పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా అవసరాల కోసం మెట్రో రైల్ విస్తరణ అత్యంత ఆవశ్యకమని తెలిపారు. ఇందుకు అనుగుణంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. త్వరితగతిన పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :