contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పల్నాడు జిల్లా ప్రజలందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి

యేసుక్రీస్తు జన్మదినము సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని అందరికీ తెలిసిందే.

శాంతి,సమాధానాలు సుగుణాలుగా కలిగియున్న యేసుక్రీస్తు మార్గం అనుసరణీయమని, ప్రజలందరూ శాంతి, సమాధానాలతో సుఖంగా జీవించాలని కోరుతున్నట్లు శ్రీఎస్పీ గారు ఈ సందర్భంగా తెలిపారు.

క్రిస్టమస్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించుకోవాలని, క్రిస్టమస్ పర్వదిన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా జిల్లా వ్యాప్తంగా తగినంత మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో అన్ని చర్చి ల వద్ద మరియు ముఖ్యమైన ప్రదేశాలలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలందరూ కూడా పోలీస్ వారికి సహకరించి, క్రిస్టమస్ పండుగ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణములో,స్వేచ్చగా జరుపుకోవాలని చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :