హైదరాబాద్ – చైతన్యపురి పిఎస్ పరిధిలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన వేణుశ్రీ అనే యువతి శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతోంది. అయితే ఆ యువతి తన హాస్టల్ గదిలో సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు
