- ది రిపోర్టర్ టివి ఆంధ్రా తెలంగాణాలో భూ మాఫియాలా పై ఉక్కు పాదం మోపింది.
- కథనాలను చూసికూడా అధికారులు స్పందించకుంటే ఇదే గతి మీకు పడుతుంది
- అమీన్ పూర్ మున్సిపాలిటీ ఏర్పడినా నేటికీ గ్రామ పంచాయతి అనుమతులతో యధేశ్చగా అక్రమ నిర్మాణాలు
- సబ్ రిజిస్టార్ డాక్యూమెంట్స్ తో నిర్మాణాలకు అనుమతులిస్తున్నానంటున్న అమీనాపూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత
- మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీకి పర్మిషన్లు ఏంటని ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు
సర్వే నంబర్ 1003,1004,1057,1060,1062,1063, లలో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు
తీరు మార్చుకోవాలి లేకుంటే కఠిన చర్యలు తప్పవు
రాజకీయ నాయకులను చూసుకుకొని రెచ్చిపోతే రేపు మీకు ఇదే గతి పడుతుంది
పశ్చిమగోదావరి జిల్లా ఇటీవల సస్పెండైన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ ఎం.జీవన్బాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
నరసాపురం రూరల్ సీఐ ఎం.సురేష్బాబు కథనం ప్రకారం.. నిషేధిత ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములను రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ చేయడంపై ఇటీవల నరసాపురం సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ విచారణ చేపట్టారు.
రికార్డులు పరిశీలించగా మొగల్తూరు, నరసాపురం, భీమవరం మండలాలకు చెందిన 48 భూములు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా విచారణలో తెలింది.
దీనిపై సబ్ కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదించారు.
ఈ క్రమంలో ఆయా మండలాల తహసీల్దార్ల ఫిర్యాదుతో సబ్ రిజిస్ట్రార్ జీవన్ బాబును అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు.