contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌, ఆర్జీఐ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు సస్పెండ్ అయ్యారు. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ గురువారం సీపీ అవినాష్ మహంతి (Cyberabad CP Avinash Mahanthi) ఆదేశాలు జారీ చేశారు. కేపీహెచ్‌బీలో వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినందుకు ఇన్‌స్పెక్టర్ వెంకట్‌పై వేటు పడింది. భార్యాభర్తల వివాహంలో జోక్యం చేసుకొని ఓ వ్యక్తిని ఇన్‌స్పెక్టర్ వెంకట్ చితకబాదాడు. ఈ వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్‌కు గురయ్యాడు. అలాగే ఓ కేసు విషయంలో సరిగ్గా విచారణ చేయనందుకు ఆర్జీఐ ఇన్‌స్టెక్టర్ శ్రీనివాస్‌‌ను సస్పెండ్ చేస్తూ సీపీ అవినాష్ ఆదేశాలు జారీ చేశారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :