సూర్యాపేట: హుజూర్నగర్ లో రైతుబంధు కుంభకోణంలో పాల్పడ్డ తహసిల్దార్ జయశ్రీని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తాసిల్దారుగా పనిచేస్తున్న జయశ్రీ, గతంలో తను అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ ధరణి ఆపరేటర్ జగదీష్తో కలిసి 36.23 ఎకరాలకు పాసుపుస్తకాలు జారీ చేసి, రైతుబంధు నిధుల మంజూరు ద్వారా రూ.14,63,004 లక్షలు మింగినట్లు తెలుస్తోంది. 2019లో బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో పాసుపుస్తకాలు జారీ చేయడానికి సంబంధించి, జయశ్రీ బంధువుల పేర్లపై వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
రైతుబంధు నిధులను 50-50 రేషియోలో తహసిల్దార్ మరియు పట్టాదారులు పంచుకుంటున్నట్లు సమాచారం అందింది. ఈ వ్యవహారంపై జయశ్రీపై 420, 406, 409, 120(b), 468, 467 IPC సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.