contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విజయవాడ వరద బాధితులకు .. తెలుగు తమ్ముళ్ల విరాళాలు

  • మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేశ్ ని కలిసి చెక్కులు అందజేసిన నాయకులు

 

విజయవాడ వరద బాధితులకు కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ వంతుగా విరాళాలు అందజేశారు. బుధవారం నాడు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్కులు అందజేశారు. పొన్నలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ తరపున రూ. 5,80,000, పైరెడ్డిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ తరపున రూ.81,000, పసల వెంకట్రావు రూ. 50,000, సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఎనికపాటి కృష్ణ రూ.50,000 చెక్కులను అందజేశారు.

చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టానికి ఉడతా భక్తిగా తమ వంతు సాయం చేశామన్నారు. ఈ సందర్భంగా విరాళాలు అందజేసిన నాయకులు, కార్యకర్తలను నారా లోకేష్ అభినందించారు. అనంతరం డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య మాట్లాడుతూ…సమాజ సేవ చేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని, మానవతా దృక్పథంతో ముందుకొచ్చి వరద బాధితులకు విరాళాలు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :