contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నవశకం.. యువగళం బహిరంగ సభకు పోటెత్తిన జనం..

విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు జనం పోటెత్తారు. టీడీపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం పసుపుమయమైంది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జనసేన కార్యకర్తలు ఈ సభకు రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

నారా లోకేశ్ యువగళం పేరుతో చేసిన పాదయాత్ర రెండురోజుల క్రితం ముగిసింది.ఈ నేపథ్యంలోనే ఈ బహిరంగ సభను టీడీపీ నిర్వహిస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వ అరాచకత్వాన్ని అణచి వేసేందుకు ఉత్తరాంధ్ర ఉద్యమిస్తూ ముందుకు సాగుతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. మరో వంద రోజులు ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. టీడీపీ- జనసేన అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.

వర్ల రామయ్య మాట్లాడుతూ..లోకేశ్ యువగళంలో 3,123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు నేనున్నాననే భరోసాను కల్పించారన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జనం సభకు వచ్చారని, ఈ సభను చూస్తుంటే రాబోయే రోజుల్లో టీడీపీ-జనసేన పార్టీలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.యువగళం పాదయాత్ర అవినీతి పాలకుల గుండెల్లో సింహస్వప్నంలా మారిందన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :