contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వ‌ర‌ద బాధితుల‌కు సాయం అందిస్తున్న సీత‌క్క‌ … ఆయా సంస్థ‌ల‌తో క‌లిసి బాధితుల‌కు పంపిణీ

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో తెలంగాణ‌లోని చాలా ప్రాంతాలు… ప్ర‌త్యేకించి గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల‌కు చెందిన బాధితులు క‌ట్టుబ‌ట్ట‌ల‌తో సుర‌క్షిత ప్రాంతాల‌కు చేరారు. ఇప్పుడిప్పుడే వ‌ర‌ద ప్ర‌భావం త‌గ్గుతున్న నేప‌థ్యంలో వారంతా తిరిగి త‌మ గ్రామాల‌కు చేరుకుంటున్నారు. అయితే అప్ప‌టికే వ‌ర‌ద‌లో మునిగి క్ర‌మంలో తేలుతున్న ఇళ్ల‌ను శుభ్రం చేసుకోవ‌డమే వారికి త‌ల‌కు మించిన భారంగా మారింది. మ‌రోవైపు నిత్యావ‌సరాలు లేక ప‌స్తులుండాల్సిన ప‌రిస్థితి. ప్ర‌భుత్వం కొంత‌మేర సాయం అందిస్తున్నా… అది ఏ మూల‌కూ స‌రిపోవ‌డం లేదు. దీంతో కాంగ్రెస్ మ‌హిళా నేత‌, ములుగు ఎమ్మెల్యే ద‌న‌సిరి అన‌సూయ అలియాస్ సీత‌క్క వ‌ర‌ద బాధితుల‌కు నిత్యావ‌స‌రాల‌ పంపిణీలో మునిగిపోయారు.

వ‌ర‌ద బాధితుల స‌హాయం కోసం వివిధ సంస్థ‌ల నుంచి నిత్యావ‌స‌రాలు సేక‌రించిన సీత‌క్క… ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో క‌లిసి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌కు వెళ్లారు. ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో క‌లిసి వ‌ర‌ద బాధితుల‌కు తన వెంట తీసుకెళ్లిన దుప్ప‌ట్లు, నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సీత‌క్క… దానికి సుదీర్ఘ కామెంట్‌ను కూడా జ‌త చేశారు. మీరెంత స‌హాయం చేసినా సంతృప్తి క‌ల‌గ‌క‌పోవ‌చ్చు కానీ… ఏ స‌హాయం చేయ‌కుంటే మాత్రం సంతృప్తి అన్న‌దే ద‌క్క‌దు అంటూ ఆమె పేర్కొన్నారు. త‌న పిలుపున‌కు స్పందించి వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చిన ఆయా సంస్థ‌ల‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :