హైదరాబాద్ : “ది రిపోర్టర్” ముద్రించిన 2023 క్యాలండర్ ని ఎసిపి వేణుగోపాల్ రెడ్డి , నాంపల్లి సిఐ రాజు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎసిపి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రతి పని లోను విజయం సాధించే విధంగా ఉండాలని , అలాగే “ది రిపోర్టర్” వార్తల వెనక వాస్తవాన్ని సమగ్రమైన కథనాలతో అందించేవిధంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు.అలాగే సిఐ రాజు నాయక్ మాట్లాడుతూ అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు చెరువవుతుందని అన్నారు. క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎసిపి వేణుగోపాల్ రెడ్డి , నాంపల్లి సిఐ రాజు నాయక్ , “ది రిపోర్టర్” సిటీ క్రైమ్ డెస్క్ ఇంచార్జ్ కిరణ్, రాజేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు
