తిరుపతి జిల్లా పాకాల మండలం స్థానిక రైల్వే జంక్షన్ నందు రైల్వే కోచింగ్ డిపో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.ఇప్పటికే దాదాపు 80% ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైనదని మిగిలిన కార్యాచరణ సిద్ధం చేసే పనిలో రైల్వే శాఖ అధికారులు నిమగ్నమై ఉన్నారని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలియజేసారు.మంగళవారం పార్లమెంటు సభ్యులకి ఏపీ నారా యువశక్తి తరఫున ప్రెసిడెంట్ మచ్ఛా దొరసామి నాయుడు,నారా సుబ్రహ్మణ్యం నాయుడు,ఉక్కడాల వరప్రసాద్,కె.ప్రతాప్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినారు.