contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Tirumala : లడ్డు రాజకీయాల్లోకి ఎక్కింది : చింత మోహన్

తిరుపతి: కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో, తిరుపతి లోని టీటీడీ లడ్డూ నాణ్యతపై సుప్రీం కోర్టులో నేడు వాదనలు వినిపించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ తరపున సిదార్థ్ లూథ్రా న్యాయస్థానంలో వాదించగా, సుప్రీం కోర్టు ఆయనకు అనేక ప్రశ్నలు విసిరించింది.

“లడ్డూను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకువస్తున్నారు? నెయ్యిని కల్తీ చేశారని మీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా?” అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీనికి సిద్దత్ర లోత్రా స్పష్టమైన సమాధానం ఇవ్వలేక పోయారు. “మీరు నిర్ధారణ చేసినట్లు ప్రకటించిన కారణం ఏమిటి?” అని కోర్టు మరింత వివరాలు అడిగింది.

చింతామోహన్ మాట్లాడుతూ, “మనం టీటీడీ దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నామని చూస్తున్నాం. చంద్రబాబుకు లడ్డూ విషయంలో జోక్యం చేసుకోవద్దని నేను ముందే చెప్పాను. అలా జరుగుతుంటే, స్థానికుల కోసం నిర్వహించాల్సిన స్వామివారి దర్శనాన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు,” అన్నారు.

అంతేకాకుండా, అమిత్ షా కొడుకు జైషా కి తిరుమలలో జరిగిన దర్శనం పద్ధతి పై ప్రశ్నలు కూడా చర్చకు వచ్చాయి. “స్థానికులకు వారంలో ఒకసారి స్వామివారి దర్శనం అంటే ఇప్పటివరకు ఊసే లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.

తిరుపతిలో మునుపటి పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ, “టీటీడీ లోని 10 వేల ఉద్యోగులను ఇబ్బంది పెడితే, నేను సహించను” అని చింతామోహన్ అన్నారు. తిరుపతిలో నెల రోజులు సెక్షన్ 30 పోలీసులు విఫలమైందని, “జగన్ తిరుమలకు వస్తె అంత భయం ఎందుకు?” అని ప్రశ్నించారు.

“తిరుపతిలో బ్రిటీష్ పోలీసులు, ఇండియన్ పోలీసుల మధ్య ఆధిక్యం లేదు. ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం కూడా ఒక సమస్య,” అన్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించే స్పందనకు స్పందన లేకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చింతామోహన్ చివరగా, “టీటీడీ ఈ ప్రాంత ప్రజల వద్దే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేయాలి” అని సూచించారు. అలాగే, “చంద్రబాబు మొదటగా రాష్ట్రంలో నిరుద్యోగులపై దృష్టి సారించాలి” అని ఆహ్వానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :