contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అధైర్య పడకండి అందుబాటులో ఉంటాం…ముంపు ప్రాంతాలలో : పులివర్తి నాని

తుఫాను ప్రభావంతో తిరుపతి రూరల్ మండలంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. తిరుచానూరు పంచాయతీ పరిధిలోని నక్కల కాలనీ, వివి నగర్, టెలిఫోన్ కాలనీ, చంద్రశేఖర్ కాలనీ… సి మల్లవరం పంచాయతీలోని గాంధీపురం, పద్మావతి పురం పంచాయతీలో కొన్ని ప్రాంతాలు నీటి మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో చంద్రగిరి ఎమ్మెల్యే ఆర్డిఓ, ఎమ్మార్వో, పోలీసు శాఖ, స్థానిక తెదేపా నాయకులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. నీటి మునిగిన ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం , త్రాగునీరు, వసతికి సంబంధించి స్థానిక తెదేపా నాయకులతో, అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండి ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడ ఉన్న ప్రజలను వసతి సముదాయాలకి తరలిస్తు…. ప్రజలకు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ముంపు ప్రాంతాలలో ప్రజలకు అన్ని రకాల సహాయ చర్యలు చేపడుతుందని ధైర్యంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :