contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు

మనకు నిత్యజీవితంలో కొన్ని దృశ్యాలు కదలిస్తూ ఉంటాయి. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే కొందరు మాత్రం కనీస కనికరం కూడా చూపడంలేదు. దానికి ఈ ఘటనే సాక్ష్యం అని చెప్పవచ్చు.

తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కొడుకులు తల్లిని భారంగా భావిస్తున్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే కొందరు మాత్రం కనీస కనికరం కూడా చూపడంలేదు. అనాధలుగా రోడ్లపైన వదిలేస్తున్నారు. తాజగా వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని 8 రోజుల క్రితం కొందరు కసాయి కొడుకులు స్మశానంలో వదిలేశారు. జగిత్యాల జిల్లా మోతే గ్రామానికి చెందిన రాజవ్వకు నలుగురు కొడుకులు వారిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. వృద్దాప్యంలో తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నలుగురు కొడుకులకు భారంగా మారింది తల్లి రాజవ్వ.. దీంతో రాజవ్వని ఎలాగైనా వదిలించుకోవాలనుకొని కొడుకులు స్మశానంలో వదిలేశారు.

గత ఎనిమిది రోజులుగా మోతె స్మశానవాటికలోనే వృద్దురాలు రాజవ్వ కాలం వెల్లదీస్తోంది. తన నాలుగురు కొడుకులలో ఎవరి దగ్గరనూ ఆశ్రయం పొందలేక, చివరకు స్మశానంలో చివరి మజిలీ జీవితాన్ని వెల్లదీస్తోంది. ఆమె కుమారుడు, పెన్షన్ డబ్బుల కోసం తల్లిని దారుణంగా కొట్టి ఆమెను అచేతన స్థితిలో విడిచిపెటట్టడం విస్మయానికి గురిచేసింది. విరిగిన కాలుతో తన పనులు చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ మంచానికి పరిమితమైంది. నలుగురు కొడుకులని కని, పెంచి అచేతనంలో ఉన్న తనను కనీసం మనిషిగా చూడడం లేదని ఆ తల్లి రాజవ్వ రోదిస్తుంది. ఈ పరిస్థితిలో రాజవ్వను వదిలి వెళ్ళిపోయిన కొడుకులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మశాన వాటికి చేరుకున్న సంక్షేమశాఖ అధికారులు అక్కడికి చేరుకొని రాజవ్వ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారం రోజులుగా స్మశాన వాటికలో బక్కచిక్కుకుపోయి ఉండడంతో కాస్త కోలుకున్న తర్వాత రాజవ్వ దగ్గర ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి వయోవృద్ధుల చట్టం ప్రకారం ఈ ఘటనపై అవసరమైన చర్యలు తీసుకుంటామని సంక్షేమశాఖ అధికారి నరేష్ తెలిపారు. ఈ క్రమంలో దుష్ట కుమారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :