contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు..

విజయనగరం జిల్లా బాడింగి మండలం కోడూరు గ్రామంలో నేడు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లి అప్పల నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక అపరిషృత భూ సమస్యల పరిష్కారానికి పటిష్టంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని, ఈ సదస్సులు రైతులకు గొప్ప అవకాశం ఇచ్చే అవకాశాలను అందిస్తున్నాయని  అప్పల నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకొని తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

భూసమస్యలపై రైతులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, దరఖాస్తులు చేసుకుంటే వాటిని త్వరితగతిన రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారు. అలాగే, జిరాయితి చెరువుల హద్దులు నిర్ణయించడం, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంటుంది. ఈ చర్యలు గ్రామంలో మరిన్ని పనులకు అవకాశాలను సృష్టిస్తాయి” అన్నారు.

అలాగే, దేవాదాయ శాఖ మరియు అటవీ శాఖ భూముల వివరాలను తహసీల్దార్  తెలియజేయాలని కోరారు. గ్రామకంఠం, 22 ఏ లో ఉన్న భూముల వివరాలు అందిస్తే, ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడతాయి అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్, వీఆర్వోలు, దేవాదాయ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామ పెద్దలు రెడ్డి కృష్ణ, కొల్లి చిన్నమనాయుడు, కొల్లి సత్య రావు, మరిపి రమేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :