contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్న రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని గిరిజనుల దీక్ష

  • అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నVRO, RI  లను సస్పెడ్ చేయాలి

 

అల్లూరి జిల్లా, హుకుంపేట మండల కేంద్రంలో కాసులకు కక్కుర్తిపడి ఆక్రమణలకు ప్రోత్సహిస్తూన్న హుకుంపేట వి ఆర్ ఓ,కొండబాబు,అర్ ఐ లను తక్షణమే సస్పెండ్ చేయాలని దీక్షలు చేపడుతున్న గిరిజనులు డిమాండ్ చేసారు.  గిరిజనేతరాలు బుడ్డిగ కొండమ్మ పాత వెలుగు కార్యాలయం,పంచాయితీ కార్యాలయ స్థలాలను ఆక్రమించుకొని,  6 భహుల అంతస్తుల ఇండ్లు నిర్మించి కొని వుందని వారు తెలియజేశారు.  ప్రస్తుత వెలుగు కార్యాలయం స్థలాన్ని VRO కొండబాబు, RI ల ప్రోత్సాహంతో మరో భవనం నిర్మించు కొంది. బుడ్డిగ కొండమ్మకు పై అధికారుల అనుమతి ఉందని తక్షణమే ఈ స్థలం అప్పజెప్పాలని వి ఆర్ ఓ, ఆర్ ఐ లు వెలుగు అధికారులతో చెప్పడంతో వారు వెలుగు స్థలాన్ని కాలి చేసినట్టు వారు తెలియజేశారు.

వెలుగు సిబ్బంది నాటుకొన్న జామ, అరటి తోటలు రెవెన్యూ అధికారులు దగ్గరుండి నరికించి నట్టు వారు తెలియజేశారు. ఆ అక్రమ భవనానికి రహదారి సౌకర్యం కోసం ఒక గిరిజనుడు నిర్మించుకున్న నిర్మాణాన్ని తమ సిబ్బందితో తొలగించిన రెవెన్యూ అధికారుల చర్యలకు నిరసనగా  దీక్షచేపట్టారు.  1/70 చట్టాన్ని తుంగలో తొక్కి గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, కొండమ్మతో పాటు మండల కేంద్రంలో గిరిజనేతరులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని, ఆక్రమణ దారులపై LTR కేసులు నమోదు చేయాలని  డిమాండ్ చేశారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టే వరకు దీక్షలు విరమించేది లేదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొర్ర ఆనంద్, కిల్లో రామారావు, ఒరబొయిని మత్య్స రాజు, విజయ్, చిన్నయ్య, రాము, ఆదివాసి విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలు దొర,  జీవో నెంబర్ 3 ఆదివాసి సాధన కమిటీ అల్లూరి జిల్లా కో కన్వీనర్ కూడెలి నూకరాజు,  సర్పంచ్ సోమయ్య,  లక్ష్మయ్య , డుంబ్రి గూడ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కుర్ర నాగరాజు,  నాయకులు బాబురావు భీమన్న , మోహన్, థామస్, చంటి,  మహిళలు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :