contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బిక్షం అడిగినందుకు ప్రాణం తీసాడు .. వైరల్ వీడియో

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిక్షం అడిగిన పాపానికి ఓ యాచకుడిని డిప్యూటీ తహశీల్దార్ కాలితో తన్నడంతో రోడ్డుపై వెళ్తున్న టిప్పర్ కింద పడిపోయి స్పాట్ లోనే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్-మామిడిపల్లి చౌరస్తా వద్ద సిగ్నల్ పడిన సమయంలో డిప్యూటీ ఎమ్మార్వో రాజశేఖర్ కారు ఆగింది. శివరాం (32) యాచకుడు కారు అద్దాలు తుడిచి డబ్బులు ఇవ్వమని ప్రాదేయపడ్డాడు. కారు డ్రైవర్ చేస్తున్న రాజశేఖర్ కారును కొద్దిగా ముందుకు పోనిచ్చాడు. డబ్బులు ఇస్తాడన్న ఆశతో శివరాం కారుతో పాటు ముందుకు వచ్చాడు.

ప్యూటీ తహసీల్దార్ కారులో నుంచి కిందకు దిగి కోపంతో శివరాం ని కాలితో తన్నాడు. వెనుక నుంచి వస్తున్న టిప్పర్ వెనుక టైర్ కింద పడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు శివరాం. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వెరల్ అవుతున్నాయి. యాచకుడు శివరాం కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బిక్షం అడిగిన పాపానికి నిండు ప్రాణాలు బలికొన్న డిప్యూటీ ఎమ్మార్వో రాజశేఖర్ ని కఠినంగా శిక్షించాలని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :