contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సింగపూర్‌ వెళ్తా.. పాస్‌పోర్టు ఇప్పించండి : మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి

అమరావతి : అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో బెయిల్‌ మంజూరు సందర్భంగా విధించిన షరతులను సడలించాలని కోరుతూ వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సింగపూర్‌ వెళ్లేందుకు వీలుగా మేజిస్ట్రేట్‌ వద్ద సరెండర్‌ చేసిన పాస్‌పోర్టును తిరిగి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిన్నెల్లి కుమారుడు ఉన్నత చదువుల రీత్యా సింగపూర్‌ వెళ్తున్నాడని, అక్కడకు వెళ్లి తండ్రిగా ఆయన కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. పోలీసుల తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేస్తామని, సోమవారం విచారణ చేపట్టాలని కోరారు. అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ విచారణను 28 కి వాయిదా వేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :