contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారుల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ : సీఎం జగన్ నిర్ణయం

 

ఆంధ్రప్రదేశ్ లో  కరోనా  మహమ్మారి అనేక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా బారినపడిన తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతుంటే, వారి పిల్లలు అనాథల్లా మారుతున్నారు. ఒకే ఇంట్లో అత్యధిక సంఖ్యలో మరణాలు కరోనా కారణంగా సంభవిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించారు. ఆ మొత్తాన్ని పిల్లల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నారు. ఆ ఫిక్స్ డ్ డిపాజిట్ పై వచ్చే వడ్డీతో పిల్లల అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను నిర్దేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.ఏపీలో ఇప్పటివరకు 9 వేలకు పైగా కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. మహమ్మారి వైరస్ కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :