contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రేపు తెలంగాణ క్యాబినెట్ అత్యవసర సమావేశం…లాక్ డౌన్ పై కీలక నిర్ణయం

 

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు రాష్ట్ర క్యాబినెట్ అత్యవసర సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఈ భేటీ జరుగుతుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్, వర్షాల సీజన్, వ్యవసాయం, గోదావరి ఎత్తిపోతల పథకాలు, జలవిద్యుదుత్పత్తి తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. రేపటి క్యాబినెట్ భేటీ అనంతరం లాక్ డౌన్ పై కీలక నిర్ణయం వెలిబుచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలో ప్రస్తుతం కరోనా ఉద్ధృతి బాగా తగ్గిపోయింది. కరోనా రోజువారీ కేసుల సంఖ్య 1500కి లోపే నమోదవుతోంది. అటు కరోనా మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఇప్పటికే పలు ఆంక్షలు సడలించిన సర్కారు, రేపటి క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని వెసులుబాట్లు కల్పించే అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :